అమరావతి : అక్టోబరు 31:మీడియా స్వేచ్ఛ ను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. 2430 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యూ జే) డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాపిత నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచినట్లు ఐ.జె.యు. ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ. వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ లు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి , ప్రజా ప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు అందించటంతో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు.జర్నలిస్టులుతో పాటు ప్రజాస్వామిక వాదులు కలిసిరావాలని వారు విజ్ఞప్తి చేశారు. పత్రికలు, టీవీ ఛానళ్లు తో పాటు సామాజిక మాధ్యమాల పైన ప్రభుత్వం కక్షసాధింపుగా వ్యవహరిస్తుంది అనేందుకు ఈ జి.ఓ.తీసుకు రావటమే ఇందుకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఈ జి.ఓ.ను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం జరుగుతోందని హెచ్చరించారు.కలిసివచ్చే రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులను కలుపుకొని ముందుకు పోవటం జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా జీవో ని వెనక్కి తీసుకోవాలనిసూచించారు.ఐ.వి. సుబ్బారావు,చందు జనార్దన్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జి.ఓ.నెంబరు 2430 వెంటనే ఉపసంహరించాలి