శ్రీకాకుళం : అక్టోబరు 31 : స్ధానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో నవంబరు 7వ తేదీన జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ జె.నివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్.అండ్ బి. సూపరింటెండెంటు ఇంజనీరు కె.కాంతిమతి కి పలు సూచనలు చేసారు. కోడిరామూర్తి స్టేడియం మరియు ఆర్ట్స్ కాలేజి మైదానంలో అభ్యర్దులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా బారికేట్లును ఏర్పాట్లు చేయాలని సూచించారు. రన్నింగ్ ట్రాక్ ను చదును చేయాలని ఆదేశించారు. ట్రాక్ ను నీటితో తడుపుతూ అభ్యర్ధులకు పరిగెత్తడానికి అనుకూలంగా తయారు చేయాలన్నారు. మరుగుదొడ్డు పరిశుభ్రంగా ఉంచాలని నీటికి ఇబ్బంది రాకూడదని మరుగుదొడ్లలో బకేట్లు మరియు మగ్గులను ఏర్పాట్లు చేయాలని మున్సిఫల్ కమీషనర్ ఎం.గీత ను ఆదేశించారు. ప్రతి మరుగుదొడ్ల దగ్గర లైటింగ్ ఏర్పాట్లు చేయాలని వాటర్ పూర్తిగా అందుబాటులో లేకపోతే ట్యాంకర్లను ఏర్పాట్లు చేయాలన్నారు.మరుగుదొడ్లు ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి సెప్టిక్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైనన్నీ బయో టోయిలేట్లును ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్దులకు పెద్ద పెద్ద డ్రమ్ములతో మంచినీటి ఏర్పాటు చేయాలన్నారు. ఉచిత వైధ్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు.అభ్యర్ధులు పడుకోడానికి మంచాలు, పరుపులు,దుప్పట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ జిల్లా క్రీడాధికారిని ఆదేశించారు. అంబేద్కర్ ఆడిటోరియం, కోడిరామూర్తి స్టేడియం మరియు ఆర్ట్స్ కాలేజి మైదానంలో భారీ లైటింగు ఏర్పాటు చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణని ఆదేశించారు. మైదానంలో షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. నవంబరు 5వ తేదీ నాటికి ఏర్పాట్లును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబరు 7వ తేదీన జరగబోయో ఆర్మీ రిక్రూట్ మెంటు కు హాజరయ్యే అభ్యర్ధులు వారికి కేటాయించిన తేదిలకు ఒకరోజు ముందుగా హాజరవ్వలన్నారు. కేటాయించిన తేదిలలో కాకుండా తరువాత వచ్చిన అభ్యర్ధులను ఆర్మీ రిక్రూట్ మెంటుకు అనుమతించరని కాబట్టి అభ్యర్ధులు సమయానికి రావలసినదిగా సూచించారు. అభ్యర్ధులకు రాత్రి 12.00 గంటల నుండి రిక్రూట్ మెంటుకు మొదలౌతుందన్నారు. ప్రతి అభ్యర్ధికి బయోమెట్రిక్ అయిన తరువాత నే కోడిరామమూర్తి మైదానంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. అభ్యర్ధులకు సులువుగా ఉండడం కోసం 300 మంది వంతున ఆర్ట్స్ కళాశాల మైదానంలోకి పంపించడం జరుగుతుందన్నారు. దళారుల మాటలు నమ్మవద్దనీ ఇది కేవలం వారి వారి సామర్ధ్యంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ రిక్రూట్ మెంటులో
ఆర్మీ రిక్రూట్మెంటు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టరు