ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

శ్రీకాకుళం : అక్టోబరు 31 :  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అవతరణ దినోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలి.అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణను స్మరించుకుంటూ తెలుగు వారికి ఒక రాష్ట్రం కోసం ఆయన ప్రాణాల్నే త్యాగం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ.. నవంబరు 1 ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా తరఫున, మొత్తంగా వైశ్య సమాజం తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 1952 డిసెంబరు 15న ఏకంగా 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత శ్రీరాములు గారు అమరులయ్యారు. ఆ అమరజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన ఆత్మార్పణ తర్వాత 1953 అక్టోబరు 1న ఒక రాష్ట్రంగా ఏర్పడినా, ఆంధ్రప్రదేశ్ గా 1956 నవంబరు 1న భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించాం. కాబట్టి నవంబరు 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా యేటా జరుపుతామని జగన్ మోహన్ రెడ్డిగారు మాట ఇచ్చారు.ఆడిన మాటకు కట్టుబడి, ఆరేళ్ళ తర్వాత మళ్ళీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలను మన చరిత్రకు, మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.