రేపే మైనారిటీ సంక్షేమ దినోత్సవం

శ్రీకాకుళం : నవంబరు 10 : భారతరత్న మౌలానా  అబుల్  కలాం  అజాద్ 132వ జయంతి వేడుకలను సోమ వారం  ఉదయం  10 గంటల  నుండి  శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, జిల్లా కలెక్టర్  జె.నివాస్ మరియు ప్రజా ప్రతినిధులు  పాల్గొననున్నట్లు ఆమె ఈ ప్రకటనలో తెలిపారు.