మానసిక వికలాంగుల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసం

శ్రీకాకుళం : డిశంబరు 8 :మానసిక వికలాంగత అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం.వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా అంగ వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం. అయితే మెడికల్‌ బోర్డు ప్రతినెల నిర్ణీత సమయాల్లో జిల్లా వైద్యశాల యందు సమావేశమై సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తుంది.వికలాంగుల పునరావస నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే 1981 సంవత్సరం  ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది.1983 సంవత్సరం వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలు పర్చే నిమిత్తం సహాయ సంచాలకుల కార్యాలయాలు పనిచేస్తున్నవి. వికలాంగుల సహకార సంస్థ కార్యకలాపాలు పదవిరీత్యా జాయింటు కలెక్టరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టగరుగా, సహాయ సంచాలకులు పదవిరీత్యా వికలాంగుల సహకార సంస్థ జిల్లా మేనేజరుగా వ్యవహరిస్తారు. మొత్తం మీద జిల్లా కలెక్టరు గారి అధికార పర్యవేక్షణలో వికలాంగు సంక్షేమం కొరకు నిర్దేశించబడిన పునరావాస కార్యక్రమాలు అమలుపరచబడు తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం మరియు అభివృద్ధి కొరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా విభజించబడినవి.విద్యా పరంగా అంధ మరియు బధిర, మూగ బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలకు నడుపబడుచున్నవి. వికలాంగలు సంక్షేమ శాఖ మరియు ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుపబడు చున్నవి. భారత ప్రభుత్వం ద్వారా సహాయం పొంది, పొందుండా కూడా ఉన్న ప్రభుత్వే తర సంస్థలు విద్యారంగములో తమ వంతు సహాయం అందిస్తున్నవి.ప్రత్యేక పాఠశాలల్లో ప్రవేశ నిమిత్తం ఆయా పాఠశాల  హెడ్‌ మాస్టర్లను సంప్రదించవలయును.  ప్రతి సంవత్సరం మే నెల నుంచే తమ, తమ పిల్లలను చేర్పించడానికి చర్యలు తీసుకొన వలయును. అంగవైకల్య శాతం, తల్లి దండ్రుల ఆదాయ పరిమితికి లోబడి పాఠశాల స్క్రీనింగు కమిటీ విద్యార్థులను ఎంపిక చేస్తుంది.ఇది గాక విద్యాశాఖ ద్వారా సమీకృత విద్యావిధానం కూడ ప్రవేశపెట్టబడినది. ప్రతి జిల్లాలో బధిరులకు, అంధులైన విద్యార్థుల కొరకు ఒక్కొక్క తరగతి గుర్తించిన పాఠశాలలో ప్రారంభించబడినది. అందరికీ విద్య లక్ష్యంతో అవసరమైన ప్రతిచోట ఇటువంటి విద్యావిధానం అమలుకు విద్యాశాఖ దశలవారీగా చర్యలు తీసుకుంటున్నది. అలాగే విద్యాపరంగా ఈ దిగువ సూచించిన పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నవి.అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రవేశానికి వికలాంగులయిన విద్యార్థులకు రిజర్షేన్‌ కల్పించబడినది. విశ్వవిద్యాలయాలు, సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు వగైరాలతో సహా ప్రతి  వికలాంగుడు తమకు అన్నిటా సమాన అవకాశాలు, సంఘంలో ప్రత్యేకించి ప్రభుత్వ యాజమాన్య సంస్థలలో కల్పించబడాలి అనే ప్రాతపదిక గుర్తుంచుకొని జీవితంలో వారి హక్కుల సాధనకు ముందుకుపోవాలి. డాక్టరు కోర్సులలో 0.25 శాతం  ఇంజనీరింగు కోర్సులలో 0.50 శాతం  ప్రవేశంలో రిజర్వేషను కలదు.వికలాంగుల ఆశ్రమ పాఠశాలలే కాకుండా, వసతి గృహాలలో కూడా ఉండి చదువుకొనేందుకు వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 3అవకాశాలు కల్పించబడినవి. వికలాంగులైన బాలబాలికలు తమ దగ్గరలో గల రాష్ట్ర సంక్షేమ శాఖ ఏ వసతి గృహంలో అయినా వారి నిబంధనలకు లోబడి ప్రవేశం పొందవచ్చును.ప్రభుత్వ గుర్తింపు మరియు సహాయం పొందిన విద్యాసంస్థలో చదివే వికలాంగ విద్యార్థులకు వారి విద్యా స్థాయిననుసరించి ఉపకార వేతనం మంజూరు చేయబడుతుంది. చలన సంబంధమైన వైకల్యం కల వారికి ప్రయాణపు అలవెన్సు, చలన పరికరాలను నిరంతరం ఉపయోగంలో ఉంచేందుకు (మెంటెనెన్స్‌ అలవెన్సు), అంధులకు రీడర్సు అలవెన్సు మంజూరు చేయబడతాయి.ప్రి మెట్రిక్‌  అనగా 1వ తరగతి  నుంచి 8 తరగతి వరకు పోస్టు మెట్రిక్‌  అనగా 9వ తరగతి నుంచి ఆపైన చదువులకు చెల్లించే ట్యూషన్‌ ఫీజులు వసతిగృహంలోని విద్యార్థులకు కొన్ని పరిమితులకు లోబడి చెల్లించబడతాయి.మానిసిక వికలాంగులకు ఉపకార వేతనాలు చెల్లించబడతాయి. మెట్రిక్‌ పూర్వపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచిత సరఫరా 1వ తరగతి  నుంచి 10వ తరగతి వరకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం విద్యాశాఖ ద్వారా సరఫరా చేయబడుతున్నవి.అంధ విద్యార్థులకు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయబడుచున్నవి.రీసెర్చి స్కాలర్లుకు ఉపకారవేతనాలు చెల్లించబడతాయి.ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకారం సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు టేప్‌ రికార్డులు, క్యాసెట్‌లు చదువుకొనే నిమిత్తం ఉచిత సరఫరా.అంధులు, చలన సంబంధమైన వైకల్యం కలవారికి పబ్లిక్‌ పరీక్షల సమయంలో 30 నిమిషాలు అదనంగా అనుమతిస్తారు.బధిర విద్యార్థులకు పబ్లిక్‌ 10వ తరగతిలో రెండు లాంగ్వేజెస్‌ వ్రాయకుండా ఇంటర్‌లో ఇంగ్లీషు లాంగ్వేజి వ్రాయకుండా మినహాయింపు ఉంటుంది.వికలాంగులైన 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది.అంధ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల సమయంలో ”స్కైబ్‌”ని ఇస్తారు.అంతేకాక వికలాంగుల కొరకు వికలాంగలు సహకార సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుచుండేవి. ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక శిక్షణ సంస్థలు, బి.యి.డి, టి.టి.సి, కోర్సులలో వికలాంగులకు ప్రవేశానికి రిజర్వేషన్లు కలవు. వృత్తి విద్యా కోర్సులలో ట్యూషన్‌ ఫీజు తిరిగి ఇచ్చే పథకం కలదు. రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ సంస్థలు 1995వ సంవత్సరం వికలాంగులకు సమాన అవకాశాలు. సంపూర్ణ భాగస్వామ్యం చట్టం అనుసరించి ఎంపిక చేసిన ఐ.టి.ఐలలో ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించింది. అయితే ప్రభుత్వం, మారుతున్న పరిస్థితులలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌లో శిక్షణలాంటి క్రొత్త కోర్సులలో ప్రవేశానికి చర్యలు తీసుకొంటుంది. ఐ.టి.ఐ సీట్లలో 2 శాతం మరియు టి.టి.సి.లో 3 శాతం రిజర్వేషన్లు, కలవు. అన్ని కోర్సులలో రిజర్వేషన్లు వికలాంగులకు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా సమాన అవకాశాలు, ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఏ అంశాన్నయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు.ఇవే కాక వికలాంగుల పునరావసం నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించబడినవి.1 శాతం అంధులకు, 6వ రోష్టరు పాయింటు, 1 శాతం మూగ బధిరులకు, 31వ రోష్టరు పాయింటు, 1 శాతం చలన సంబంధమైన అంగవైకల్యం గల వారికి 56వ రోష్టరు పాయింటు కలపడం జరుగుతుంది.వికలాంగుల కొరకు గుర్తించిన పోస్టులు 3 సంవత్సరాల వరకు ఖాళీగా ఉంచాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వయో పరిమితి అర్హత, వికలాంగుల కొరకు 10 సంవత్సరాలు  సడలించారు.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో వికలాంగులకు కేటాయించబడిన ఉద్యోగాల నియామకం ఆ పోస్టు స్థాయిననుసరించి ఉపాధి కల్పన కార్యలయం ద్వారా గాని, పేపరు ప్రకటనలు, సర్వీస్‌ కమీషను ద్వారా గాని జరుగుతాయి.కాలేజి సర్వీసు కమీషన్‌ నిర్వహించే ఐఉజూఊ శ్రీ ఉజూఊ కు హాజరయ్యే విద్యార్థులకు, అభ్యర్థికి 180 రూపాయలు పరీక్ష రుసుము ఇవ్వబడుతుంది. ఆదాయ పరిమితి సంవరానికి  3600 రూపాయలు.అందరికి ఉద్యోగాలు లభించవు. కానీ జీవనం సాగించాలి. అందుచేత ప్రజల విస్తృత ప్రయోజనాలు, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం సాగించేటట్లు చేయటానికి స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్ట బడినవి. స్వయం ఉపాధికి నిర్దేశించిన అన్ని గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి పథకాలలో వికలాంగులకు 3 శాతం కేటాయించారు. అలాగే సి.యం.ఇ.వై., పి.యం.ఆర్‌.వై. అన్ని బలహీన వర్గాల ఆర్థిక సహాయ సంస్థలలో వికలాంగులకు ప్రత్యేక కేటాయింపు ఉంది.యన్‌.హెచ్‌.యఫ్‌.డి.సి. ద్వారా బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వమే స్వయం ఉపాధికి అప్పులిచ్చే పథకం ప్రవేశపెట్టింది.వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా సబ్సిబీ యిచ్చే పథకం అమలులో ఉంది. దీని ద్వారా చిన్న, చిన్న వ్యాపారాలకు బ్యాంకులు అప్పు మంజూరు పత్రం ఇవ్వనిచో ప్రత్యేక పరిస్థితులలో నేరుగా రూ.3,000 మంజూరు చేయవచ్చు.అయితే వికలాంగులు స్వయం ఉపాధిపథకం కోరే ముందు ఆ పథకం గురించి సరైన అవగాహన ఉండాలి. ఆ ఉపాధి పథకం వివరాలు పూర్తిగా తెలుసుకొని అందులో అవసరమయిన శిక్షణ పొంది ఉంటే ఆ పథకం సద్వినియోగానికి తోడ్పడుతుంది.ఇవి గాక అనేక ఉపాధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్నవి.వికలాంగులయినటువంటి 'లా' కోర్సు చదివిన పట్టభద్రులు లా పుస్తకాలు కొనుగోలు మరియు ఎన్‌రోల్‌మెంటు ఫీజు నిమిత్తం 1,700 రూపాయలు మంజూరు అవుతున్నాయి.సివిల్‌ సప్లయిస్‌ వారి రేషన్‌ షాపులలో 3 శాతం వికలాంగుల నిమిత్తం కేటాయించాలి.స్టాంపుల అమ్మకం వ్యాపారం మంజూరు చేయునపుడు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సహాయ సంస్థ అందచేసిన రుణాలలో వికలాంగులైన లబ్దిదారుల నిమిత్తం 50,000 రూపాయలు వరకు తక్కువ వడ్డీతో అప్పు మంజూరు చేయబడుతుంది.విద్య మరియు చలనన సంబంధమైన పరికరములు వికలాంగుల పునరావాసానికి, 'చలనం' అతి ముఖ్యమైన అంశం, వారు పరికరాల సహాయంతో ఇతర మార్గాల ద్వారా క్రొత్త క్రొత్త ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఎన్నో విషయాలు తెలుసుకోవడం, విద్యసభ్యసించడం ద్వారా వారి స్వయం పునరావసాన్ని మార్గం సుగమం చేసుకుంటారు. అందుచేత చలన పరికరాలు వికలాంగుల పునరావసంలో విడదీయలేని అంశం. ఈ పరికరాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా చేయబడుచున్నవి. అయితే రాష్ట్ర ప్రభుత్వ కూడ ముందుకు వచ్చి, వికలాంగు లందరికీ చలన పరికరాలు అందచేయాలనే ఉద్దేశ్యంతో వారి అవసరాలను గుర్తించి దశల వారీగా వాటిని తీర్చే ప్రయత్నం చేయు చున్నది. ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ ఈ చలన పరికరాలు అందచేసే బాధ్యత తీసుకొన్నది. వికలాంగుల సహకార సంస్థ పరిధితో గల మూడు చక్రాల బళ్లు, సరఫరా కేంద్రాలు, కృత్తిమ అవయవములు, కాలిపర్లు, వినికిడి యంత్రాల సరఫరా కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలు పరచబడుతోంది. అంధులకు చేతికర్రలు కాసెట్స్‌, టేపురికార్డర్స్‌ బ్రెయిలీ పలకలు, టైపురైటర్లు, ఇతర విద్యసభ్యసించేందుకు అవసరమైన అన్ని పరికరాలను సరఫరా చేస్తుంది. పోలియో సోకిన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడుచున్నది.వికలాంగులు కొంత బలహీనులు కావటం వలన వారికి సాంఘిక భద్రత కల్పించే విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు పరుస్తోంది.వికలాంగులకు పెన్షన్‌ నెలకు 3000 రూపాయలు సకలాంగుల, వికలాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే  ప్రోత్సాహక బహుమతి కూడా ఇస్తారు.బలహీనవర్గాల ఇండ్ల కేటాయింపులో లబ్దిదారుల వాటా వికలాంగులు 3 వాయిదాలలో కట్టే సౌకర్యం.ఎ.పి. హౌసింగు బోర్డు ద్వారా కట్టి మంజూరయ్యే ఇళ్ళలో 2 శాతం వికలాంగులకు కేటాయింపు.అన్నిప్రభుత్వ పథకాలలో 3 శాతం నిధులువికలాంగుల చట్టం 1995 నందలి ఏర్పాట్లననుసరించి అన్ని అభివృద్ధి పథకాలు మరియు దారిద్య్ర నిర్మూలన పథకములలో 3 శాతం  నిధులు వికలాంగుల సంక్షేమం, పునరావాసానికి కేటాయించి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.తదునుగుణంగా జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ, ఇందిరా క్రాంతి పథం, యస్‌.సి. కార్పొరేషన్‌, బి.సి. కార్పొరేషన్‌, మహిళా శిశు సంక్షేమ ఏజన్సీ, సెట్రాజ్‌, కెవిఐబి, జిల్లా పారిశ్రామిక కేంద్రం, మైనారిటీ కార్పొరేషన్‌ మొదలగు అన్ని సంస్థలు వారి వారి వార్షిక లక్ష్యములలో 3 శాతం  వికలాంగులకు కేటాయించి ఖర్చు చేస్తాయి.సర్వ శిక్షా అభియాన్‌ 15 సంవత్సరాల లోపు విద్యార్థులకు సహాయ వస్తు పరికరముల పంపిణీ మరియు ఆర్‌బిసి సెంటర్ల జరుగుచున్నది. అలాగే ఔటిజం, సెరెబ్రిల్‌ పాల్సి, బుద్ధి మాంద్యం, మరియు బహుళ వైకల్యం కలిగివున్న వారి సంక్షేమం మరియు పునరావాసం కొరకు భారత ప్రభుత్వము జాతీయ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ జాతీయ ట్రస్టు క్రింద స్థాయిలో జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో స్థానిక స్థాయి కమిటీలు పనిచేస్తాయి. సంరక్షకత్వం ఇచ్చే అధికారం చట్టబద్ధంగా ఈ కమిటీలకు సంక్రమింప చేయబడింది. ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది.