స్పందనకు అనూహ్య "స్పందన"

శ్రీకాకుళం:డిసెంబర్ 9: స్పందన కార్యక్రమానికి అనూహ్యస్పందన లభించిందిసోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన భవనంలో స్పందన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్సంయుక్త కలెక్టర్ డాకె.శ్రీనివాసులుసంయుక్త కలెక్టర్ ఆర్.గున్నయ్యజిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధిజిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు .కళ్యాణ్ చక్రవర్తి,  గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారుస్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి  పెద్దఎత్తున ఆర్జీదారులు పాల్గొనడం విశేషం కార్యక్రమంలో  గార మండలం బోరవానిపేట గ్రామానికి చెందిన వాన జగదీష్ కుమార్ తన రేషన్ కార్డు ఇన్ ఏక్టివేట్ అయినందున తనకు నెలవారీ రేషన్ సరుకులు సరఫరా కావటం లేదనితన మానసిక వికలాంగ కుమారినికి పింఛను కూడా ఆగిపోయినదని విన్నవించారు.తన రేషన్ కార్డును ఏక్టివేట్ చేయించి తనకు న్యాయం చేకూర్చాలని కలెక్టర్ కు వినతిని సమర్పించారుజిల్లా బధిరుల సంఘం కార్యదర్శి జె.సంతోష్కె.శ్రీనివాసరావుఉదయ్ శంకర్ నారాయణ తదితర సభ్యులుతమకు విభిన్న ప్రతిభావంతులు కోటాలో ఉద్యోగ అవకాశాలు కలిగించాలని కోరారుగిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలనువిద్యా సంస్థలుగురుకులాలుజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలుతాము 12 సం. నుండి విధులు నిర్వహిస్తున్నామని, 2017-18 సం.లో త్రిల్ హెల్త్ అండా వెల్ నెస్ మరియు న్యూనెట్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ అనే థర్డ్ పార్టీ వారికి ఆరోగ్య కార్యకర్తల కార్యక్రమాన్ని అప్పగించడం జరిగిందని తెలిపారుతమకు నెలవారీ జీతభత్యాలను చెల్లించాలనిఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ లో ఆదివాసీ ఆరోగ్య కార్యక్రమాని్ని విలీనం చేయాలని  డి.శాంతారావులక్ష్మికె.నాగభూషణ్కె.సురేష్కె.అనిత తదితరులు దరఖాస్తును సమర్పించారుమెప్మా రిసోర్స్ పర్సన్స్ ద్రాక్షాయనిసీతారత్నంలక్ష్మిబి.రత్నం తదితరులుతాము మెప్మాలో గత 10 సం.లుగా స్వయం శక్తి సంఘ రిసోర్సు పర్సన్స్ గా పని చేస్తున్నామని,40 సంవత్సరాలుదాటిన వారిని తొలగించనున్న  సర్క్యులర్ వచ్చినందున తమను తొలగిస్తారనే భయంగా వున్నదని తెలిపారు.తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనిముఖ్యమంత్రి వర్యులు అందిస్తున్న గౌరవ వేతనాన్ని అందించాలని కోరారురణస్థలం నుండి దేశపు తిరుపతి రావురెడ్డి విశ్వేశ్వర రావులంక ప్రభాకర రావుఆదినారాయణతదితరులు తమ భూములను రహదారి విస్తరణ నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ ద్వారా తీసుకోవడం జరిగిందనిమూడు సంవత్సరాలు కావస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదనిత్వరిత గతిన నష్టపరిహారాన్ని అందించి తమకు న్యాయం చేయాలని అర్జీని సమర్పించారునందిగాం మండలం  కొత్త అగ్రహారం గ్రామం నుండి పాలతీర్థం వనజాక్షితమ పొలం పక్కన దాబా నిర్వహిస్తున్న వారు తమ పొలంలోకి ప్లాస్టిక్  వ్యర్ధాలుగాజు పెంకులు చెత్తచెదారాలను వేసి బెదిరిస్తున్నారని,  తమకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఆమదాలవలస నియోజకవర్గం తాడివలస గ్రామం నుండి సీపాన నారాయణమ్మతన భర్త మరణించడంతో పేదరికంలో వున్న తనకు ఒంటరిమహిళ పింఛనును మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తును సమర్పించారు.ఎచ్చెర్ల నుండి నేదుర లక్ష్మమ్మతనకు స్వంత స్థలం వున్నందున గృహనిర్మాణ పథకం ద్వారా  గృహాన్ని నిర్మించాలని కోరారు. కంచిలి మండలం నుండి  యర్ర శకుంతలస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సోంపేట బ్రాంచ్ లో తనకు రూ.1,30,000 లు సేవింగ్స్ ఖాతాలో వున్నాయనితనకు తెలియకుండా  వేరే వ్యక్తులు తన ఖాతా నుండి రూ.70 వేలు విత్ డ్రా చేసారని తెలిపారుతాను సోంపేట బ్యాంకులోవిశాఖపట్నం క్రైమ్ బ్రాంచ్ మరియు పోలీసు స్టేషన్ లోను ఫిర్యాదు చేసినా ప్రయోజనం కలుగలేదనితనకు న్యాయం చేయాలని కోరారుశ్రీకాకుళం నుండి టి.శ్రీనివాస రావుతనకు పి.ఎం..వైపథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని కోరారుశ్రీకాకుళం నుండి జి.సరోజిని తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని కోరారు.  దివ్యాంగులకు 6 మందికి  ట్రై సైకిల్స్  ఇద్దరికి వీల్ చైర్స్ జిల్లా కలెక్టర్ పంపిణి చేశారు.