శ్రీకాకుళం :డిశంబరు :దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ట్రైసైకిళ్ళు,వీల్ చైర్ లు పంపిణీ చేసారు. సోమవారం స్పందన కార్యక్రమంలో తమకు ట్రై సైకిళ్ళు, వీల్ చైర్సు కావలసినదిగా కోరుతూ, దరఖాస్తు చేసిన విభిన్న ప్రతిభావంతులకు ఆ శాఖ ద్వారా ట్రైసైకిళ్ళను, వీల్ చైర్లను మంజూరు చేయడం జరిగింది. స్పందన కార్యక్రమం అనంతరం పి.అప్పల నరసమ్మ, డి.గణపతి, డి.కన్నంనాయుడు, డి గన్నయ్య, డి.మల్లేసు, కె. మాలచ్చి లకు ట్రై సైకిళ్ళు,సి.హెచ్ పాపారావు, జె.బాహ్నవిలకు వీల్ చైర్లు పంపిణీ చేసారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ -సహాయసంచాలకులు జీవన్ బాబు జిల్లా కలెక్టర్ తో పాటు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.