ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ మెట్రో ఫైనాన్షియల్‌ బిడ్‌ను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు కొత్త కన్సెల్టెంట్‌కు బాధ్యతలు అప్పగించింది. ఓపెన్‌ టెండర్‌ ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


అయితే ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్షియం సింగిల్‌ బిడ్‌ దాఖలు చేసింది. దీంతో ఫైనాన్సియల్‌ బిడ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.