ఒరిస్సా తీరంలో అల్ప పీడనం

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో పలు చోట్ల సాదారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న నాలుగురోజులు కోస్తాతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు చలిగాలుల ప్రభావం వుండే అవకాశాలున్నట్లు తెలిపింది.ఒరిస్సా తీరాన్ని ఆనుకొని అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా ఆంధ్ర ప్రదేశ్ తీరప్రాంతం వెంబడి గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో చలి గాలులు, కోస్తా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.చలుగాలుల తీవ్రత ఎక్కువగా వుండనుంది కాబట్టి తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరించారు.