ఆంధ్రప్రదేశ్ కేబినేట్ కీలక నిర్ణయాలు

అమరావతి : డిశంబరు 11 : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 బిల్లుపై ఇవాళ సుదీర్ఘంగా చర్చించిన ఆంధప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా బిల్లు చట్టంగా మారితే అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణ శిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు లభ్యమైతే కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు తీసుకువస్తున్నారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, మరో 14 రోజుల్లో విచారణ జరిపించాల్సి వుంటుంది. అంటే మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్‌ వచ్చేలా చట్టంలో మార్పులు చేస్తున్నారు. అంతేకాక అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు,వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు విచారణకు ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టయ్యింది.
ఇక ఈ బిల్లు చట్టంగా మారితే సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే సెక్షన్‌ 354 (ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో పేర్కొన్నారు. ఇక మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించేలా బిల్లులో పేర్కొన్నారు. మెయిల్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాగే పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించనుంది. అంతే కాక పోస్కోచట్టం కింద ఇప్పటి వరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ ఉన్న జైలుశిక్షను పెంచుతూ బిల్లులో ఉన్న అంశాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది.గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణకు కొత్త శాఖ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ భూములపై కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ కొనుగోళ్లను రద్దు చేసింది ప్రభుత్వం


ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
* దిశ చట్టానికి ఆమోదం


 * ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.* ప్రజారవాణ శాఖ ఏర్పాటుకు ఆమోదం
* ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదం
* ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం
* ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు, సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం


* కాపు ఉద్యమంలో తుని రైలు దహనం కేసు విచారణను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తూ నిర్ణయం
* కాపు ఉద్యమం నాటి కేసులు మాఫీ
* భోగాపురం ఎయిర్ పోర్టు వ్యతిరేక ఉద్యమ కేసులు మాఫీ
* ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం
* గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణకు కొత్తశాఖ
* సాధారణ పరిపాలన శాఖ పరిధిలోకి కొత్త శాఖ
* సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ భూములకు థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం