శ్రీకాకుళం : జనవరి 6:వ్యవసాయ శాఖ రూపొందించిన గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణా సమాచార దీపిక, సహజపధ్ధతులలో ద్రావణాలు మరియు కషాయాల తయారీ విధానం మరియు వినియోగం పుస్తకాలు మరియు వై.ఎస్.ఆర్.రైతు భరోసా – పి.ఎం.కిసాన్ కరపత్రికలను జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం విడుదల చేసారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయదారులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. వీటిని రైతులు సద్వనియోగపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, గృహనిర్మాణ సంస్ధ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జి.శ్రీధర్, ఎస్.సి.కార్పోరేషన్, బి.సి.కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.మహాలక్ష్మి, జి.రాజారావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎం.చంద్రకళ, ఎ.డి.హేండ్లూమ్స్ వి.పద్మ, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఇ. శ్రీనివాసరావు తదితరులు హాజరైనారు.
గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణా సమాచార దీపిక కరపత్రం ఆవిష్కరణ