దేశ ప్రధాని క్రొత్త సంవత్సరం కానుక

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ రైతులకు కొత్త ఏడాది కానుకగా రూ.2,000 అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎలా అంటే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారని విశ్వాసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద జనవరి 2న రూ.12,000 కోట్లను 6 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలో వేయనుందని తెలిపారు.డిసెంబర్ 1 నుంచి రూ.2,000 డబ్బులు పొందని రైతులకు ఈ డబ్బులు వారి అకౌంట్లలో జమయ్యే అవకాశముంది. ప్రస్తుత సంవత్సరం చివరి విడత రూ.2,000 ఇవి. దీంతో 6.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఇప్పుడు, ఇకపై పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. లేదంటే లేదు.ఇకపోతే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద అర్హులైన రైతులు ప్రతి ఏడాది రూ.6,000 పొందొచ్చు. నాలుగు నెలలకు ఒకసారి మూడు దఫాలుగా రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్లలోకి ఈ డబ్బులు వచ్చి చేరతాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్యకాలానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే వస్తాయి.మీకు డబ్బులు వచ్చాయా? రాలేదా? అనే విషయాన్ని ఆన్‌లైన్‌లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. పోర్టల్ పైన కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్ ఫెయిలూర్ రికార్డ్, బెనిఫీషియరీ స్టేటస్, బెనిఫీషియరీ లిస్ట్ అనే నాలుగు ఆప్షన్లు కనినిస్తాయి. వీటిల్లో బెనిఫీషియరీ స్టేటస్ ఎంచుకోవాలి. ఇప్పుడు మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు