జన్మ భూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు : తప్పిన పెనుప్రమాదం

అన్నవరం : జన్మ భూమి( 12806 ) ఎక్స్‌ప్రెస్‌ సీ3 బోగీలో మంటలు చెలరేగాయి. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగానే ఫైర్ వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అన్నవరం, తిమ్మాపూర్ మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అలర్టయిన సిబ్బంది ట్రైన్‌ని ఆపేసి ప్రయాణికులను దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది.