గ్రామ సచివాలయాల పర్యవేక్షణ అవసరం : జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం : జనవరి 20: గ్రామ సచివాలయాల పని తీరును  పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ వివిధ అభివృధ్ధి పనులపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూప్రజలకు సత్వర పాలన అందించడానికి గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.  ప్రత్యేక అధికారులంతా సచివాలయాలు సక్రమంగా  నిర్వహించే విధంగా పని చేయాలని తెలిపారు.  వివిధ  ప్రభుత్వ పథకాల వివరాలనులబ్దిదారుల జాబితాలను సచివాలయాలలో పోస్టర్లలో ముద్రించి ప్రజలందరికీ తెలిసే విధంగా వుంచాలన్నారు. ముందుగా పింఛనులురేషన్ కార్డులుగృహాలు తదితర లబ్దిదారుల జాబితాలను సంబంధిత మండల అభివృధ్ధి అధికారులు పక్కాగా పరిశీలన చేయాలన్నారు. సచివాలయాలలో టేబుళ్ళుకుర్చీలు, బీరువాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్ల్యాప్ టాప్ లు కూడా అందుబాటులో వుండాలన్నారు. సచివాలయాలలోని ఉద్యోగుల హాజరు పట్టికను  పరిశీలించాలనిగార్హాజరైన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.  హాస్టళ్ళలోని మరమ్మత్తు పనులను పర్యవేక్షణ చేయాలనిధాన్యం కొనుగోలు కేంద్రాలు  నిబంధనలననుసరించి పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలించాలని తెలిపారు.   మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు  ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ వివరించారు.  నోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించిఅభివృధ్ధి పనులుసంక్షేమ పథకాలపై  సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.