మంచి సమాజం స్థాపనకు ఒక చిరు ప్రయత్నం.........

నేటి నుండి బిచ్చగాళ్లకు ఆహారం మరియు నీరు మాత్రమే ఇద్దాము.ధన రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు.ఒక నిర్దిష్టమైన సామజిక పునరుజ్జీవనం కోసం ముంబైలో ప్రచారం ప్రారంభమైంది. ఈ సామజిక పునరుజ్జివన ప్రచారంలో బాగంగా.అక్కడి ప్రతి ఒక్కరూ "ఇప్పటినుండి. మేము అన్ని రకాల బిచ్చగాళ్లకు (మహిళలు ,పురుషులు ,వృద్దులు ,వికలాంగులు,పిల్లలు)ఆహారం మరియు నీరు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వము" అని ప్రమాణం చేసారు. దీని ప్రయోజనం ఏమిటంటే బెగ్గింగ్ మాఫియా యొక్క ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల పిల్లల అపహరణ కూడా తగ్గుతుంది. బెగ్గింగ్ మాఫియా దాతలలో దాతృత్వాన్ని ప్రలోభపెట్టడానికి. అపహరణకు గురైన పిల్లల అవయవాలు కత్తిరించడం లేదా యాసిడ్ తో వికృతీకరించడం చేస్తున్నారు. కొందరికి శరీర భాగాలకు రక్త సరఫరాను నిలిపివేయడానికి రక్త నాళాలు కుట్టబడి ఉంటున్నాయి.అందువల్ల నేటి నుంచి మీరు కూడా ఈ సామజిక మార్పు కోసం భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను.మరియు మీరు ఇకపై బిచ్చగాళ్లకు ఆహారం మరియు నీరు తప్ప నగదును అందించబోమని ప్రమాణం చేయండి.ఒక కొత్త సామజిక మార్పునకు నాంది పలకండి.నాకు ఒక వాట్స్ యాప్ గ్రూపు ద్వారా వచ్చిన ఈ సమాచారం సమాజం మార్పుకోసం ఉపయోగపడుతుంది అని భావించి ఇలా నా "కళింగ రాజ్యం" వెబ్ వార్తగా ప్రచురిస్తున్నాను.ఆలోచించండి మిత్రులారా మనము అలాగే చేద్దాం.మంచి సమాజం నిర్మాణం చేద్దాం........