శ్రీకాకుళం : ఏప్రిల్ 16: ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం పట్టణ పరిధిలోని 16, 17 వార్డు, న్యూకోలనీ, గాజుల వీధి, బుచ్చయ్య పేట ప్రాంతాలలో ఉచిత రేషన్ సరకులను పంపిణీ చేసారు.కిల్లిపాలెం గ్రామంలో వి.ఆర్.ఓ. విశ్వేశ్వరరావు, డీలర్ శంకర రావు, వాలంటీర్ లక్ష్మణమ్మ, ఇంటింటికీ వెళ్ళి రేషన్ సరకులను పంపిణీ చేసారు.కరోనానేపధ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచితరేషన్ సరకులను అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రెండవ విడత ఉచితంగా బియ్యం శనగలు పంపిణీ